Posts

Father Of The Atomic Bomb About Destroyer of Worlds - Anu Gita అణు గీత!

Image
  అణు గీత! ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబు సృష్టిలో ప్రపంచ శ్రేయస్సు కోరే భగవద్గీత పాత్ర ఉందా? సాక్ష్యాత్తు ద్వాపర యుగ పురుషుడైన శ్రీ కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన మహోత్కృష్ట గ్రంథరాజం, శ్రీమద్ భగవద్గీత. ప్రపంచ మానవాళికి మార్గదర్శకమైన 700 పైచిలుకు శ్లోకాలుండే భగవద్గీతను, ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలని అంటారు. కలియుగ ఆరంభానికి ముందు, అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం, సాక్ష్యాత్ పరమాత్ముడు చెప్పిన విషయాలను మనకు అందించారు, వ్యాస భగవానులవారు. మతాలకు అతీతమైన ఈ అద్భుత గ్రంథాన్ని చదివి ఆకళింపు చేసుకున్న వ్యక్తి, తన జీవితంలోని ప్రతి సమస్యనూ సులువుగా ఎదుర్కోవడమే కాకుండా, ఆదర్శ పురుషుడిగా కీర్తింపబడతాడన్నది చారిత్రక వాస్తవం. అంతెందుకు, 8 రోజుల అంతరీక్ష యాత్ర కోసం వెళ్లి, 286 రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి, Nasa వ్యోమగామి సునీత విలియమ్స్, 9 నెలల తన సుదీర్ఘ రోదశి యాత్రను ముగించుకుని, 2025, మార్చి 19 న భూమిపైకి సురక్షితంగా చేరిన విషయం తెలిసిందే. తన సంకల్ప బలానికీ, తాను క్షేమంగా తిరిగి రావడానికీ దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తనకు ఎల్లవేళలా తోడుండే వినాయక ప్రతిమ, భగవద్గీత...

5000-year-old statue within a 1500-year-old temple | వింత ఆలయం!

Image
వింత ఆలయం! గ్రహణ సమయంలోనూ మూయని గుడి! నైవేద్యం అలస్యమైతే శుష్కించిపోయే విగ్రహం! ధర్మనిరతికీ ఎనలేని విజ్ఞానికీ పుట్టినిల్లు మన భారత దేశం అన్నది చారిత్రక వాస్తవం. అదే చరిత్ర, ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకూ, ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్ధంకాని రహస్యాలకూ పుట్టినిల్లని చెబుతోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ, గ్రహణ సమయంలో మూసి వేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయాలలో కూడా తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్ధాలు విషపూరితమవుతాయని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది. మనుషులు తీసుకోకపోవడమే కాకుండా, మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారమూ నివేదించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన ఫలహారాలను వండి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో 365 రోజులూ, గ్రహణం వచ్చినా, వరదొచ్చినా, సునామీయే వచ్చినా, ఈ ఆలయంలోని దేవతా మూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే, ఆ విగ్రహం వెంటనే బక్కచిక్కి పోతుందని అంటున్నారు....

Aurangzeb: The Man and the Myth | ఔరంగ్ జేబ్!

Image
  ఔరంగ్ జేబ్! మన పాఠ్య పుస్తకాలు తెలియజేయని, నివురుగప్పిన నిప్పువంటి వాస్తవాలను కొంతకాలమే దాయగలరు! భూమి అట్టడుగు పొరల్లో దాగున్న శిలాద్రవంలా అసలైన చరిత్ర కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు తన్నుకు రాకమానదు! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విధంగా జరిగి తీరుతుంది. సాధారణంగా మన ఛానల్ లో ఇంతవరకూ, బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని చారిత్రక గాధలూ, కావాలని కుహనా మేధావులు దాచిన హైందవ వీరుల అపురూప చరిత్ర, ఒకప్పుడు అఖండ భారతవనిని ఏలిన గొప్ప చక్రవర్తుల అపూర్వ గాధల గురించి మాత్రమే చెప్పుకున్నాము. మంచితో పాటు, చెడు గురించిన అవగాహన కూడా భావితరాలకు కల్పించాలన్న సదుద్దేశ్యంతో ఈసారి మాత్రం, ఒక హిందూ ద్వేషి, పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడి జీవితం, హైందవ ఆలయాలను ధ్వంసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఒక నీచుడి గుట్టు, కోట్లాదిమంది ఆమాయక హిందువుల జీవితాలను మత మార్పిడి పేరుతో కాలరాసిన నరహంతకుడి కుతంత్ర భాగోతం గురించిన వాస్తవాలను తెలుసుకుందాము. అతనెవరో కాదు, ఆఖరి మొఘల్ చక్రవర్తి, పరమ హిందూ ద్వేషిగా పేరు పొందిన Aurangzeb. అసలు Aurangzeb ఎవరు..? అతనికీ మనవారికీ యుద్ధం ఎలా జరిగింద...

'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince శంభాజీ అసలు చరిత్ర!

Image
శంభాజీ అసలు చరిత్ర! 21 ఏళ్లలో ఓటమి ఎరుగని 140 యుద్ధాలు! చివరకు బావమరిది కుట్రకు బలి! శూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఒక మహాయోధుడి చరిత్రను ఈ రోజు తెలుసుకుందాము. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్నీ ఒడ్డిన పులిబిడ్డ చరిత్ర ఇది. 9 ఏళ్ల వయస్సులోనే తండ్రితో పాటు వెళ్ళి, చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవితకాలంలో, 140 కి పైగా యుద్ధాలలో పాల్గొని, ఒక్క యుద్ధంలో కూడా ఒడిపోని రణధీరుడి మరపురాని చరిత్ర. శత్రువులకు చిక్కి, 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ, కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా, తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢ చిత్తంతో నిలబడి, చివరకు మృత్యువు ఒడిలో సేదదీరిన మహానీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దు బిడ్డ.. హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కు పుట్టిన యువ సింహం, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతీ, ధర్మవీరుడు శంభాజీ మహరాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా ‘Chaava’ అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి, ఇన్నేళ్లుగా మన కుహనా చరిత్రకారులు దాచేసిన అసలైన గాధను సవి...

మంత్ర రాజం Mantra Rajam

Image
  మంత్ర రాజం: నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే! 'సాంబా' అని పిలిస్తే  చాలు.. శివుడు వెంటనే కరిగిపోతాడు.  మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి  శివదీక్ష ఇస్తూ... ”నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే... య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్” అనే మంత్రాన్ని ఉపదేశించారు. చాలా గొప్పదయిన ఈ మంత్రం, శివపురాణంలో కూడా వస్తుంది. నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.. ఈ నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది. 1). నమః శివాయ... (శివాయ నమః) మహాపంచాక్షరీ మంత్రం. శివ భక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి. అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం.. న, మ, శి, వా, య అనే అయిదు అక్షరాల శివ మంత్రం స్ధూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది. 2). సాంబాయ... అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ సమృద్ధిగా పొంద వచ్చును. 3). శాంతాయ... ఆయనను తలంచుకుంటే వచ్చేది శాంతం. జీవితా...

Battle of the Ten Kings in Rigveda | Dasaragna War | దశరాజ్ఞ యుద్ధం

Image
ఆఫ్ఘనిస్థాన్ లో సనాతన ధర్మం! @teluguvoice.in ‘దశరాజ్ఞ యుద్ధం’ ‘Battle of The Ten Kings’ గురించి ఋగ్వేదంలో ఏమని పేర్కొనబడింది? ఈ ప్రపంచంలో నేటికీ మనుగడలో ఉన్న ఏకైక పురాతన నాగరికత, అత్యంత ఉత్కృష్టమైన విలువలు కలిగిన ధర్మం ఏదైనా ఉంది అంటే, దానికి ఒకేఒక్క సమాధానం మన ‘సనాతన ధర్మం’. అయితే, తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచం మొత్తం వ్యాపించిన మన ధర్మం, ఉత్థాన పతనాలను ఎన్నింటినో చవి చూసింది. అద్భుతమైన రాజ భవనాలతో, ఆమోఘమైన శిల్ప కళలతో కూడుకున్న అందమైన ఆలయాలూ, నేటి metropolitan సిటీలను కూడా తలదన్నే ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించిన నగరాలూ, వర్తక వ్యాపారాలూ, ప్రాచీన కళలతో మన హిందూ ధర్మం పాదం మోపిన ప్రతి చోట, దేదీప్యమానంగా వెలుగొందింది. అయితే, స్వార్ధపూరిత, మానవస్థాపిత కొత్త మతాల పుట్టుక మనుషులలో క్రూరత్వాన్ని నింపడమే కాకుండా, ఎంతో అద్భుతమైన మన సనాతన ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దాదాపు తుడిచి పెట్టేసింది. అందుకు నేటికీ మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లిన ఆ ప్రాంతం, ఇప్పుడు ఎందుకని ఎడారి మత...

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi

Image
అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 teluguvoice.in స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ] దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌...