Father Of The Atomic Bomb About Destroyer of Worlds - Anu Gita అణు గీత!

అణు గీత! ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబు సృష్టిలో ప్రపంచ శ్రేయస్సు కోరే భగవద్గీత పాత్ర ఉందా? సాక్ష్యాత్తు ద్వాపర యుగ పురుషుడైన శ్రీ కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన మహోత్కృష్ట గ్రంథరాజం, శ్రీమద్ భగవద్గీత. ప్రపంచ మానవాళికి మార్గదర్శకమైన 700 పైచిలుకు శ్లోకాలుండే భగవద్గీతను, ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలని అంటారు. కలియుగ ఆరంభానికి ముందు, అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం, సాక్ష్యాత్ పరమాత్ముడు చెప్పిన విషయాలను మనకు అందించారు, వ్యాస భగవానులవారు. మతాలకు అతీతమైన ఈ అద్భుత గ్రంథాన్ని చదివి ఆకళింపు చేసుకున్న వ్యక్తి, తన జీవితంలోని ప్రతి సమస్యనూ సులువుగా ఎదుర్కోవడమే కాకుండా, ఆదర్శ పురుషుడిగా కీర్తింపబడతాడన్నది చారిత్రక వాస్తవం. అంతెందుకు, 8 రోజుల అంతరీక్ష యాత్ర కోసం వెళ్లి, 286 రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి, Nasa వ్యోమగామి సునీత విలియమ్స్, 9 నెలల తన సుదీర్ఘ రోదశి యాత్రను ముగించుకుని, 2025, మార్చి 19 న భూమిపైకి సురక్షితంగా చేరిన విషయం తెలిసిందే. తన సంకల్ప బలానికీ, తాను క్షేమంగా తిరిగి రావడానికీ దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తనకు ఎల్లవేళలా తోడుండే వినాయక ప్రతిమ, భగవద్గీత...