Posts

Showing posts from February, 2025

మంత్ర రాజం Mantra Rajam

Image
  మంత్ర రాజం: నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే!  TELUGU VOICE 'సాంబా' అని పిలిస్తే  చాలు.. శివుడు వెంటనే కరిగిపోతాడు.  మహాభారతంలో ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి  శివదీక్ష ఇస్తూ... ”నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే... య ఇదం కీర్తయేన్నిత్యం శివసాయుజ్యమాప్నుయాత్” అనే మంత్రాన్ని ఉపదేశించారు. చాలా గొప్పదయిన ఈ మంత్రం, శివపురాణంలో కూడా వస్తుంది. నమః శివాయ.. సాంబాయ.. శాంతాయ.. పరమాత్మనే.. ఈ నాలుగు నామాలలో అత్యద్భుతమైన శక్తి ఉంది. 1). నమః శివాయ... (శివాయ నమః) మహాపంచాక్షరీ మంత్రం. శివ భక్తులకు నిరంతర జప్యమైన పంచాక్షరీ మంత్ర మహిమను శాస్త్రాలు పలు విధాలుగా వర్ణించాయి. అ, ఉ, మ, బిందు, నాద అనే పంచ అవయవాలతో కూడిన ఓంకారం సూక్ష్మ ప్రణవం.. న, మ, శి, వా, య అనే అయిదు అక్షరాల శివ మంత్రం స్ధూల ప్రణవం. పంచాక్షరిని పఠిస్తే పరమేశ్వర అనుగ్రహం సిద్ధిస్తుంది. 2). సాంబాయ... అమ్మతో ఉన్నవాడు. ఇలా పిలిస్తే చాలు శివుడు వెంటనే కరిగిపోతాడు. అమ్మతో ఉన్నవాడు అనగానే పరమేశ్వరుని దయ వేరు. అమ్మ అయ్యలతో కలిపి భావిస్తే కావలసినవి అన్నీ సమృద్ధిగా పొంద వచ్చును. 3). శాంతాయ... ఆయనను తలంచుకుంటే వచ...

Battle of the Ten Kings in Rigveda | Dasaragna War | దశరాజ్ఞ యుద్ధం

Image
ఆఫ్ఘనిస్థాన్ లో సనాతన ధర్మం!  TELUGU VOICE ‘దశరాజ్ఞ యుద్ధం’ ‘Battle of The Ten Kings’ గురించి ఋగ్వేదంలో ఏమని పేర్కొనబడింది? ఈ ప్రపంచంలో నేటికీ మనుగడలో ఉన్న ఏకైక పురాతన నాగరికత, అత్యంత ఉత్కృష్టమైన విలువలు కలిగిన ధర్మం ఏదైనా ఉంది అంటే, దానికి ఒకేఒక్క సమాధానం మన ‘సనాతన ధర్మం’. అయితే, తన సుదీర్ఘ ప్రయాణంలో ప్రపంచం మొత్తం వ్యాపించిన మన ధర్మం, ఉత్థాన పతనాలను ఎన్నింటినో చవి చూసింది. అద్భుతమైన రాజ భవనాలతో, ఆమోఘమైన శిల్ప కళలతో కూడుకున్న అందమైన ఆలయాలూ, నేటి metropolitan సిటీలను కూడా తలదన్నే ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించిన నగరాలూ, వర్తక వ్యాపారాలూ, ప్రాచీన కళలతో మన హిందూ ధర్మం పాదం మోపిన ప్రతి చోట, దేదీప్యమానంగా వెలుగొందింది. అయితే, స్వార్ధపూరిత, మానవస్థాపిత కొత్త మతాల పుట్టుక మనుషులలో క్రూరత్వాన్ని నింపడమే కాకుండా, ఎంతో అద్భుతమైన మన సనాతన ధర్మాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో దాదాపు తుడిచి పెట్టేసింది. అందుకు నేటికీ మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒకప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లిన ఆ ప్రాంతం, ఇప్పుడు ఎందుకని ఎడారి ...

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi

Image
అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐  TELUGU VOICE స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ] దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌క...

దయ్యాలు కట్టిన భారీ శివాలయం Forgotten Shiva Temple Built by Ghosts in One Night

Image
ఒకే రాత్రిలో ‘దయ్యాలు కట్టిన భారీ శివాలయం’!  TELUGU VOICE Forgotten Shiva Temple Built by Ghosts in One Night మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్ లూ, ఆధునిక పరికరాలూ లేని కాలంలోనే మన పూర్వికులు, ఎంతో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికీ, ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికీ, మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తుంటారు. కానీ, కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని, ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడంలేదు. కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతున్నారు. ఎటువంటి ఆధునిక పరికరాలూ, సాంకేతికతా లేని ఆ కాలంలో, అంత భారీ ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా? అసలు ఆ ఆలయం ఎక్క...

Hidden Facts of Vikramaditya: The Legendary King of Ancient India | విక్రమాదిత్యుడి భైరవసేన!

Image
విక్రమాదిత్యుడి భైరవసేన!  TELUGU VOICE ఈజిప్ట్ ను వణికించిన ‘విక్రమాదిత్యుడు’! అరబ్ చరిత్ర పుటలలో కీర్తించబడిన హిందూ మహాపురుషుడు! The Great Wall Of China కీ విక్రమాదిత్యుడు చక్రవర్తి కావడానికీ సంబంధం ఉందా?  భూమి పొరల్లో మరుగుతూ దాగుండే లావా, సమయం వచ్చినప్పుడు ఎలా అయితే ఒక్కసారిగా ఉబికి బయటకు వస్తుందో, అలాగే చరిత్ర కూడా! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, తనలో దాచుకున్న మహాత్ముల గాధలను, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది. అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళను తెరిపిస్తుంది. అలా నేడు మళ్ళీ మన ముందుకు, చరిత్ర పదిలంగా దాచుకున్న ఓ మహా విరుడి గాధను తీసుకు వచ్చింది. భారత దేశంతో పాటు, ఆంగ్లేయుల సరిహద్దుల వరకు వ్యాపించిన ఆయన మహా సామ్రాజ్యపు ఎల్లలను మనకు చూపిస్తోంది. కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన ఓ అజానాబాహుడి ఔచిత్యాన్ని నిరూపిస్తోంది. భారతీయ పురాతన గ్రంధాలలోనే కాకుండా, ఇస్లామిక్ చారిత్రక పుస్తకాలలో సైతం మహా పురుషుడిగా కీర్తించబడిన ఆ చక్రవర్తి గాధనూ, మనలో చాలా మందికి తెలియని ఆయన చరిత్రనూ, కుహనా మేధావులు దాచాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఇతిహాసాన్నీ, కేవలం చందమామ కథల్లో వినిపించే ...

భీష్మ ఏకాదశి 2025 Bhishma Ekadashi

Image
ఈ రోజు 08-02-2025 'భీష్మ ఏకాదశి' విశేషం   TELUGU VOICE మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయం...

RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!

Image
సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!  TELUGU VOICE కుబేర నిర్మితం, స్వర్ణ శోభిత భవంతులతో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశం, ఆ యుగం చూడని అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నగరం, రావణ ఆక్రమిత ‘లంక’. అసుర రాజు ఏలిన లంక.. సీత మాత కన్నీటితో మలినమైన లంక.. హనుమ దహించిన లంక.. రాముడి చేతిలో పరాజయం పొందిన లంక.. నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక కాదా..? మరి రావణ పాలిత లంక నేడు ఉన్న శ్రీలంక కానప్పుడు, అసలు లంక ఎక్కడ ఉంది..? అలాంటప్పుడు ధనుష్కోటి నుంచి శ్రీలంకను కలుపుతున్న రామసేతు, రాముడు నిర్మించినదెలా అయ్యింది? రావణ లంక కుమారీ ఖండంలో భాగమా..? మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి? అసలు శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZgGKSd_PD_Q ] నేటి శ్రీలంక రావణ లంక కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అసలు రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా కని...