Hidden Facts of Vikramaditya: The Legendary King of Ancient India | విక్రమాదిత్యుడి భైరవసేన!
విక్రమాదిత్యుడి భైరవసేన!
ఈజిప్ట్ ను వణికించిన ‘విక్రమాదిత్యుడు’! అరబ్ చరిత్ర పుటలలో కీర్తించబడిన హిందూ మహాపురుషుడు! The Great Wall Of China కీ విక్రమాదిత్యుడు చక్రవర్తి కావడానికీ సంబంధం ఉందా?
భూమి పొరల్లో మరుగుతూ దాగుండే లావా, సమయం వచ్చినప్పుడు ఎలా అయితే ఒక్కసారిగా ఉబికి బయటకు వస్తుందో, అలాగే చరిత్ర కూడా! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, తనలో దాచుకున్న మహాత్ముల గాధలను, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది. అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళను తెరిపిస్తుంది. అలా నేడు మళ్ళీ మన ముందుకు, చరిత్ర పదిలంగా దాచుకున్న ఓ మహా విరుడి గాధను తీసుకు వచ్చింది. భారత దేశంతో పాటు, ఆంగ్లేయుల సరిహద్దుల వరకు వ్యాపించిన ఆయన మహా సామ్రాజ్యపు ఎల్లలను మనకు చూపిస్తోంది. కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన ఓ అజానాబాహుడి ఔచిత్యాన్ని నిరూపిస్తోంది. భారతీయ పురాతన గ్రంధాలలోనే కాకుండా, ఇస్లామిక్ చారిత్రక పుస్తకాలలో సైతం మహా పురుషుడిగా కీర్తించబడిన ఆ చక్రవర్తి గాధనూ, మనలో చాలా మందికి తెలియని ఆయన చరిత్రనూ, కుహనా మేధావులు దాచాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఇతిహాసాన్నీ, కేవలం చందమామ కథల్లో వినిపించే కాల్పనిక పాత్రగా మార్చాలనే ప్రయత్నాన్నీ, ఈ వీడియోలో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఆయన మరెవరో కాదు.. సాక్ష్యాత్ సామ్రాట్ విక్రమాదిత్య. చరిత్ర సగౌరవంగా చెప్పుకునే ఆ రాజు గురించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/B2x1lEOmKPM ]
బేతాళ విక్రమాదిత్యుల కథలూ, భట్టి విక్రమార్కుల కథలూ వినని భారతీయుడు ఉండడు. తర తరాలుగా ఈ కథలు జనబాహుళ్యంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. విక్రమాదిత్యుడనే మహా రాజు గురించి మనలో చాలా మంది, చందమామ కథల్లో ఒక పాత్ర గానే గుర్తు పెట్టుకున్నాము. కానీ ఆయన ఓ కథానాయకుడు మాత్రమే కాదు.. భారతీయ చరిత్రను మార్చిన మహా వీరుడు, మన ఘన కీర్తిని ప్రపంచపు నలుమూలలకూ చాటిన మహానుభావుడు, కలియుగంలో రామ రాజ్యాన్ని పునరుద్ధరించిన ఓ మహా చక్రవర్తి. అసలు ఆయన చరిత్ర గురించి తెలియాలంటే, సామాన్య శకానికి దాదాపు 300 ఏళ్ల పూర్వం చైనాలో జరిగిన కొన్ని పరిణామాలు తెలీసుకోవాలని, చరిత్రకారులు చెబుతున్నమాట.
విక్రమాదిత్యుడి శూరత్వం ప్రపంచానికి తెలియడానికీ, చైనాలో నిర్మించబడిన The Great Wall Of China కీ ఉన్న సంబంధం తెలియాలి. అదెలా అంటే, ఒకప్పుడు చైనా నేలపై Xiongnu అనే ట్రైబల్ ప్రజలు ఉండేవారు. వారు అత్యంత క్రూరమైన వ్యక్తులుగా చైనా చరిత్రకారులు చెబుతుంటారు. Xiongnu ట్రైబ్ ప్రజలు తరుచుగా తమ మనుగడ కోసం, చైనాలోని అనేక గ్రామాలపై, పట్టణాలపై దాడులు చేసి, అక్కడ వారికి కావాల్సిన ఆహార పదార్ధాలతో పాటు, బంగారం వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం, ఆడవారని చెరపట్టడం వంటి ఎన్నో దారుణాలకు తెగబడేవారు. Xiongnu తెగ నుంచి తన ప్రజలనూ, తన రాజ్యాన్నీ రక్షించుకోవడానికి, Qin Shi Huang అనే చైనా రాజు, చైనా వాల్ ని నిర్మించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రపంచ వింతలలో ఒకటైన The Great Wall Of China నిర్మాణం వెనుక అసలు కారణం ఇదే.
ఇలా మొదలైన చైనా వాల్, కొద్ది కొద్దిగా పెరుగుతూ మహా నిర్మాణంగా మారింది. దాంతో ఈ Xiongnu ప్రజలకు చైనాలోకి వెళ్ళడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ సంఘటన వల్ల వారు మెల్ల మెల్లగా పశ్చిమ దిక్కుకు వలస వెళ్ళడం మొదలు పెట్టారు. జనాలను హింసించి బ్రతికే స్వభావం కలిగిన Xiongnu తెగ, మధ్య ఆసియా నుంచి యూరోప్ వరకు విస్తరించడం మొదలు పెట్టారు. Xiongnu తెగను కొంతమంది చరిత్రకారులు, Huns అనే పేరుతో కూడా పిలుస్తారు. కొంతమంది, అవి రెండూ వేరు వేరు తెగలనీ, ఆ ఇద్దరూ కలిసి మధ్య ఆసియా నుంచి యూరోప్ వరకూ దండయాత్రలు చేశారనీ చెబుతారు. ఏది ఏమైనా, చైనాను విడిచి దారి మళ్లిన Xiongnu తెగ, మధ్యలో ఉన్న ఎన్నో చిన్నా చితకా ఆటవిక తెగలను నాశనం చేసింది. ఈ క్రమంలో ఒక తెగ ప్రజలు, Xiongnu దెబ్బకు భయపడి, Syr Darya నదీ పరీవాహక ప్రాంతానికి వలస వెళ్లారు.
Syr Darya అనే నది, మధ్య ఆసియాలోని Tajikistan, Uzbekistan వంటి దేశాలలో ప్రవహిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో, Syr Darya ప్రవహించే ప్రాంతం, శక అనే రాజ వంశపు ఆధీనంలో ఉండేది. ఈ స్థానిక తెగ వెనకే వచ్చిన Xiongnu తెగ, శక వంశపు ఆధీనంలో ఉండే అనేక ప్రాంతాలను ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. ఆ తెగ యుద్ధ ప్రతిభ, క్రూరత్వం కారణంగా, శక రాజ వంశం చాలా ఏళ్లు ఓటమిని చవి జూసింది. అయితే, తమ శక్తిని మొత్తం కూడగట్టుకున్న శక రాజలు, Xiongnu తెగను నాశనం చేయడమే కాకుండా, తమ రాజ్య కాంక్షను మరింతగా పెంచుకున్నారు. ఈ క్రమంలో వారు, నాటి మధ్య ఆసియాలోని అతి పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన Bactria రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. ఒకప్పుడు ఆ రాజ్యం, ప్రస్తుతం ఉన్న Turkmenistan, Afghanistan, Uzbekistan, మరియూ Tajikistan తో పాటు, కొంత భాగం పాకిస్తాన్ లో కూడా ఉండేది.
ఇలా Bactria ని కైవసం చేసుకున్న శక రాజులకు, భారత దేశంలోకి రావడానికి వీలు దొరికింది. ఎన్నో రాజ్యాలను ఒడిస్తూ, దారిలో కలిసివచ్చిన వివిధ తెగలను తమ దళంలో కలుపుకుంటూ, అత్యంత క్రూరమైన యుద్ధాలు చేస్తూ ముందుకు సాగిన శక రాజులు, భారత దేశంపై కూడా పూర్తి పట్టు సాధించారు. ఇక్కడొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, మధ్య ఆసియా నుంచి వచ్చిన ఈ శక వంశస్థులు పూజించేదీ, అనునిత్యం ఆరాధించేదీ శివుడిని. అవును.. మీరు విన్నది నిజమే.. శక రాజులూ, వారి ప్రజలూ, మహా శివ భక్తులు. హిందూత్వం అంటే కేవలం భారత దేశానికే పరిమితం, దీనికి ప్రపంచంలో మరెక్కడా స్థానం లేదని తప్పుడు ప్రచారం చేసే కుహనా చరిత్రకారులు, ఇన్నేళ్లుగా దాచిన నిజాలలో ఇది కూడా ఒకటి. ఈ లెక్కన మన సనాతన ధర్మం ఎంత పురాతనమైనది, ప్రపంచం మొత్తం ఎలా వ్యాపించి ఉండేదో అర్ధం చేసుకోవచ్చు.
నేటి పాశ్చాత్య చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునే వారి క్రీస్తు పుట్టుకకు సరిగ్గా 57 ఏళ్ల ముందు, శక రాజులు మన దేశంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. Moga అనే రాజు నేతృత్వంలో భారత దేశంపై దాడి చేసిన శకులు, నాటి కాలంలో మన దేశంలో అతిపెద్ద సామ్రాజ్యమైన ఉజ్జయినీని ఆక్రమించుకున్న తర్వాతే, మన దేశంపై పూర్తి పట్టు సాధించడానికి వారికి అవకాశం దొరికినట్లు, చరిత్ర చెబుతోంది. ఈ Moga అనే రాజునే, Maues అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రెండు పదాలకూ, హీరో లేదా పులి అనే అర్ధం వస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు. అతను అత్యంత క్రూరమైన, అత్యంత సమర్ధవంతమైన యుద్ధం చేయగల రాజుగా గుర్తింపు పొందాడు. అందుకే అతనికి పులి అనే అర్ధం వచ్చే Moga పేరును పెట్టడం జరిగినట్లు చరిత్ర నిరూపితం.
ఇదిలా ఉంటే, Moga మన దేశంపై దండెత్తిన సమయంలో, ఉజ్జయినీని పాలిస్తున్నది, మహేంద్ర ఆదిత్యుడు. అతనే భారత దేశపు దశా దిశా మార్చిన విక్రమాదిత్యుడి తండ్రి. మహేంద్ర ఆదిత్యుడు ఒడిపోయే సమయానికి, విక్రమాదిత్యుడు చాలా చిన్న పిల్లవాడు. తన తండ్రి ఓడిపోవడం, శకుల చేతిలో ఘోరమైన అవమానాలు పొందటం చూసిన విక్రమాదిత్యుడు, ఆ సమయంలో వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసినట్లు, చరిత్ర చెబుతోంది.
అయితే రాజ్యాన్ని కోల్పోయిన పసి విక్రమాదిత్యుడు, మాల్వా రాజైన భర్తృహరి దగ్గరకు చేరాడు. ఆయన విక్రమాదిత్యుడికి అన్న వరస అవుతాడని చరిత్ర చెబుతోంది. ఇదిలా ఉంటే, భర్తృహరికి సంతానం లేకపోవడం వల్ల, విక్రమాదిత్యుడు వచ్చిన కొద్ది రోజులకే ఆయనను మాల్వాకు కాబోయే రాజుగా ప్రకటించాడు. దానితో విక్రమాదిత్యుడికి యుద్ధ శిక్షణ, రాజ్య పాలనా వంటి వాటిపై పట్టు సాధించడానికి సమయం దొరికింది. విక్రమాదిత్యుడు పెరిగి పెద్దవ్వగానే, రాజ్యాన్ని అతనికి అప్పగించి, హరిద్వార్ వెళ్ళి తన శేషాజీవితాన్ని అక్కడ ప్రశాంతంగా గడిపినట్లు తెలుస్తోంది.
మాల్వా భాధ్యతలను పూర్తిగా స్వీకరించిన తర్వత విక్రమాదిత్యుడు, కొత్త రకమైన, అత్యంత బలమైన, క్రూరమైన సేన స్థాపనకు నాంది పలికాడు. దానినే భైరవ సేన అనే పేరుతో పిలిచారు. ఆ కాలంలో మాల్వా దగ్గరలో ఉన్న అనేక ఆటవిక తెగల ప్రజలనూ, నాగ సాధువులనూ తన సేనలో భాగం చేసుకున్నాడు. శకులు కూడా శివుడి ఆరాధకులే కదా, మరి నాగ సాధువులకు వారిపై కోపం ఎందుకు వచ్చింది..? హిందూ ధర్మం అపాయ స్థితిలో పడినప్పుడే కదా ఈ నాగ సాధువులు ముందుకు వచ్చి యుద్ధాలు చేసేది! అనే సందేహాలు కలుగుతాయి. అందుకు సమాధానం, శకుల జీవన విధానం. వారు మధ్య ఆసియాతో పాటు, నాటి రోమన్ కల్చర్ కి కూడా దగ్గరగా బ్రతకడంతో, వారి జీవన విధానంలో విశృంఖలత్వం పెచ్చుమీరి ఉండేది. వారి జీవన విధానం, ఇక్కడున్నవారితో నడుచుకున్న తీరు కారణంగా, సనాతన ధర్మానికి చేటు జరుగుతుందనే ఉద్దేశంతో, నాగ సాధువులు, భైరవ సేనలో భాగం అయ్యారు.
ఈ సైనిక కూటమి జరిగిన కొద్ది రోజులకే మహా కుంభమేళా రావడంతో, నదీ స్నానాలు ఆచరించిన భైరవసేన, ఆ వెంటనే శకుల పై విరుచుకు పడ్డారు. చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, ఆ సమయంలో భారత దేశం నాలుగు దిక్కులనూ నలుగురు శక రాజులు పాలించేవారు. వారందరనీ ఈ భైరవ సేన, యుద్ధంలో చిత్తు చిత్తుగా ఓడించి, ప్రాణాలతో పట్టుకుని, విక్రమాదిత్యుడి ముందుకు తీసుకొచ్చి, చంపడం జరిగింది. కేవలం వారినే కాకుండా, భారత దేశ వ్యాప్తంగా ఉన్న శక రాజ వంశస్తులందరనీ వెతికి వేటాడి, 40 ఏళ్ళలలో అఖండ భారతావనిని తన గుప్పెటలోకి తెచ్చుకున్నాడు. దానితో రాజా విక్రమాదిత్యుడు, చక్రవర్తిగా ఎదిగాడు. అంతేకాదు, తమ భైరవసేనతో శకులపై మొదలు పెట్టిన విజయయాత్రను విక్రమాదిత్యుడు, మధ్య ఆసియా మీదుగా, ఈజిప్ట్ వరకు తీసుకెళ్లినట్లు చరిత్ర విదితం.
నేడు మధ్య ఆసియా దేశాలుగా పిలవబడుతున్న Pakistan, Turkmenistan, Afghanistan, Uzbekistan, Tajikistan, Iran, Arabia దేశాల వరకూ ఉన్న మొత్తం భూభాగాన్ని, తన ప్రత్యక్ష పాలన క్రిందకు తీసుకువచ్చాడు. అంతేకాదు, విక్రమాదిత్యుడి విజయ యాత్ర గురించి తెలుసుకున్న ఈజిప్ట్ రాజులు, ఆయనతో సంధి కుదుర్చుకుని కప్పం కట్టడం మొదలు పెట్టారు. విక్రమాదిత్యుడు కదన రంగంలో ఎంతటి అరివీర భయంకరుడో, సుభిక్షమైన పాలన అందివ్వడంలో అంతే సమర్ధుడనీ, కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన చక్రవర్తి విక్రమాదిత్యుడనీ, చరిత్రకారులు కొనియాడతారు.
అంతటి మహా విరుడి గాధను, ఆధునిక భారతంలోని కుహనా మేధావులు తొక్కేయడానికి ఎంతో విశేషంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎక్కడా కూడా ఆయన అఖండ చరిత్రను గురించి తెలిపే పుస్తకాలను బయటకు రానివ్వడం కానీ, ఆయన ఘన కీర్తిని ప్రచారం చేసే సాధనలు కానీ మన గత నాయకులు చేయలేదు. ఆఖరికి పిల్లలు చదివే పాఠ్య పుస్తకాలలో కూడా, భారతీయ మహిళ చేతిలో చావు దెబ్బలు తిని, తప్పించుకుని బయటపడ్డ అక్బర్ గురించి గొప్పగా రాశారు కానీ, రామ రాజ్యాన్ని స్థాపించి, దాదాపు ఆసియాను మొత్తం తన ఏక పాలనకిందకు తెచ్చుకున్న చక్రవర్తి విక్రమాదిత్యుడి గురించి ఒక్క అక్షరం కూడా రాయలేదు. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా ఆయనను చందమామ కథల్లో నాయకుడిగా మాత్రమే చిత్రించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది.
అయితే, సహాయం పొందినవాడి చెయ్యి మాత్రం ఊరుకోలేదు.. విక్రమాదిత్యుడి ఘన కీర్తి గురించి, తమ భాషలో స్పష్టంగా రాసుకున్నారు. ఇప్పటికీ టర్కీ రాజధాని İstanbul లో ఉన్న Maktab-e-Sultania అనే ప్రాచీన గ్రంధాలయంలోని కొన్ని పురాతన అరబిక్ పుస్తకాలలో, విక్రమాదిత్యుడు ఎంతో విశేషంగా కీర్తించబడ్డాడు. ‘ఆయన కాలంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంతో అదృష్టవంతులని’ ఆ పుస్తకాలలోని ఒక వాక్యం. విక్రమ శకం, లేదా విక్రమాదిత్య శకం అని ఈ శకం వ్యవహరించబడడం కూడా సాధారణ విషయం కాదు. దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఒక శక కర్త ఉనికినే కొన్ని తరాలుగా మరుగు పరిచేశారని. ఇప్పటికైనా భారతీయ యువత మేలుకుని, కుహనా మేధావుల కుళ్ళు రాతలూ, మాటల నుంచి బయటపడి, మన ఘన చరిత్ర గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే, వారందరికీ ఈ వీడియో చేరాలి. విక్రమాదిత్యుడికి సంబంధించి మనం గతంలో చేసిన వీడియోలు కూడా చూడండి..
🚩 జై భారత్ 🙏
Comments
Post a Comment