Aurangzeb: The Man and the Myth | ఔరంగ్ జేబ్!

 

ఔరంగ్ జేబ్!
మన పాఠ్య పుస్తకాలు తెలియజేయని, నివురుగప్పిన నిప్పువంటి వాస్తవాలను కొంతకాలమే దాయగలరు!

భూమి అట్టడుగు పొరల్లో దాగున్న శిలాద్రవంలా అసలైన చరిత్ర కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు తన్నుకు రాకమానదు! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విధంగా జరిగి తీరుతుంది. సాధారణంగా మన ఛానల్ లో ఇంతవరకూ, బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని చారిత్రక గాధలూ, కావాలని కుహనా మేధావులు దాచిన హైందవ వీరుల అపురూప చరిత్ర, ఒకప్పుడు అఖండ భారతవనిని ఏలిన గొప్ప చక్రవర్తుల అపూర్వ గాధల గురించి మాత్రమే చెప్పుకున్నాము. మంచితో పాటు, చెడు గురించిన అవగాహన కూడా భావితరాలకు కల్పించాలన్న సదుద్దేశ్యంతో ఈసారి మాత్రం, ఒక హిందూ ద్వేషి, పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడి జీవితం, హైందవ ఆలయాలను ధ్వంసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఒక నీచుడి గుట్టు, కోట్లాదిమంది ఆమాయక హిందువుల జీవితాలను మత మార్పిడి పేరుతో కాలరాసిన నరహంతకుడి కుతంత్ర భాగోతం గురించిన వాస్తవాలను తెలుసుకుందాము. అతనెవరో కాదు, ఆఖరి మొఘల్ చక్రవర్తి, పరమ హిందూ ద్వేషిగా పేరు పొందిన Aurangzeb. అసలు Aurangzeb ఎవరు..? అతనికీ మనవారికీ యుద్ధం ఎలా జరిగింది..? అసలు అతను చక్రవర్తి ఎలా అయ్యాడు..? వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xtH92PF3sR4 ]


16వ శతాబ్దం మధ్యలో బాబర్ తో మొదలైన మొఘల్ సామ్రాజ్యం, 1862 లో మరణించిన రెండవ Bahadur Shah Zafar వరకూ కొనసాగింది. అయితే, Aurangzeb మరణం తర్వాత మొదలైన మొఘల్ సామ్రాజ్య పతనం, 19వ శతాబ్దం నాటికి పూర్తిగా అంతరించిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఇక ‘Aurangzeb’ అంత క్రూరమైన పాలకుడిగా మారాడానికి కారణాలు తెలియాలంటే, ముందుగా అతను చిన్నతనం నుంచి ఎదుర్కొన్న విషయాలతో పాటు, అతడి తండ్రి అయిన Shah Jahan దౌర్భాగ్యపు చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. 

Shah Jahan అనే పేరు వినగానే, ఆయనొక ప్రేమ పిపాసి, ముంతాజ్ ని అత్యంత ఘాడంగా ప్రేమించిన అమర ప్రేమికుడు, ఆమె కోసం ఏకంగా తాజ్ మహల్ నే కట్టించాడు వంటి విషయాలు, అభూత కల్పనలు మాత్రమే, మన కుహనా చరిత్రకారులు ఇంతవరకు మనకు నూరిపోస్తూ వచ్చారు. వాడంత నీచుడు మరొకడు ఉండడనే విషయాలను పొరపాటునకూడా మనకు తెలియకుండా మన కుహనా మేధావులు దాస్తూ వచ్చారు. Shah Jahan.. మొఘల్ చక్రవర్తి Jahangir కీ, అతడి రెండవ భార్య Jagat Gosain కీ పుటిన మూడవ సంతానం. Jahangirకి దాదాపు 20 మంది భార్యలు, లెక్కలేనంతమంది ఉంపుడు గత్తెలూ ఉండేవారు. అయితే వారిలో Jahangirకి బాగా దగ్గర వ్యక్తి, తెలివైన భార్య, Nur Jahan. Shah Jahan లో ఉన్న భయంకరమైన మనస్తత్వాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె, అతడిని అదుపులో పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ, Jahangir చనిపోయిన వెంటనే Nur Jahan తో పాటు, తనకు అడ్డుగా ఉన్న అన్నదమ్ములనూ, బావలనూ, ఇలా దాదాపు 36 మందిని అత్యంత ఘోరంగా చంపించాడు, Shah Jahan. సొంత అన్నతోనే యుద్ధం చేసి ఓడించి, అతడిని అత్యంత కిరాతకంగా చంపాడు.

ఇక ఆడవారి విషయానికొస్తే, Shah Jahan ని మించిన కామాంధుడు మరొకడు ఉండడు. ఇతనికి ఐదుగురు భార్యలు, దాదాపు వెయ్యికి పైగా ఉంపుడుగత్తెలు ఉండేవారు. ఇతని కంటికి అందంగా కనపడ్డ ప్రతి ఆడదాన్ని చెరిచాడు. అందుకు ఉదాహరణగా, సొంత భావమరిది ఆఖరి భార్యను చెరిచిన ఘటనను చరిత్రకారులు ప్రత్యేకంగా చెబుతారు. Shah Jahan భార్య ముంతాజ్ సొంత అన్న Shaista Khan, బెంగాల్ కి మొఘల్ గవర్నర్ గా పనిచేసేవాడు. అతనికి చాలా మంది భార్యలు ఉండగా, వారిలో ఆఖరి భార్య వయసులో చాలా చిన్నది కావడంతో పాటు, అత్యంత అందగత్తె కూడా అని చరిత్రకారులు చెబుతున్నారు. ఒకనాడు ఆమె ఆగ్రాకోటకు వచ్చినప్పుడు, ఆమె అందానికి ఒళ్ళు తెలియని Shah Jahan ఆమెను బాలాత్కరించాడు. కానీ లెఫ్ట్ చరిత్రకారులు మాత్రం, Shah Jahan గొప్పవాడు, అమర ప్రేమికుడు, తాజ్ మహల్ కట్టించాడంటూ గొప్పలు చెప్పి, ఆ అబద్ధాలనే చిన్న పిల్లల పాఠ్య పుస్తకాలలో చేర్చి, తప్పుడు చరిత్రను భావితరాలకు నూరి పోశారు.

వావి వరుసలు లేని ఇలాంటి వ్యక్తుల మధ్య పెరిగిన Aurangzeb మంచి నాయకుడు ఎలా అవ్వగలడు! Shah Jahan కి పుట్టిన నలుగురు కొడుకులలో Aurangzeb మూడవ వాడు. Dara Shikoh, Murad Bakhsh, Shah Shuja అతని అన్నదమ్ములుగా తెలుస్తోంది. వీరిలో పెద్దవాడు Dara Shikoh కాగా, మొదటి నుంచి అతనే కాబోయే మొఘల్ చక్రవర్తి అని అందరూ భావించేవారు. Shah Jahan కూడా ఎన్నో సందర్భాలలో తన తర్వత రాజు Dara Shikoh అని చెబుతుండడం, అతనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, చరిత్ర విదితం. ఒక విధంగా Aurangzeb, Shah Jahan పై పగ పెంచుకోడానికి ఈ విషయం కూడా కారణం అని చెప్పవచ్చు.

చిన్నతనం నుంచి అమిత కుంచిత మనస్తత్వం గల Aurangzeb ఆలోచనా విధానాన్ని Shah Jahan గమనిస్తూనే ఉండేవాడు. ఒకనాడు Aurangzeb తో పాటు అతని సోదరులు యమునా నది ఒడ్డిన ఏనుగుల పోరు చూడటానికి వెళ్ళగా, వాటిలో ఒక ఏనుగు అదుపు తప్పి Shah Jahan కొడుకులు ఉన్న వైపు దూసుకు వచ్చింది. భయంతో అక్కడున్న వారంతా తప్పించుకోగా, Aurangzeb ఒక్కడు ఆ ఏనుగుపైకి బల్లెం విసిరి, దాని వేగాన్ని నియంత్రించడంలో మావటి వాడికి సహకరించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఘటనతో తన కొడుకు ధైర్య సహసాలకు మెచ్చి, Shah Jahan పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడమే కాకుండా, Aurangzeb కి భారీ ఎత్తున నగదు బాహుమానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది చరిత్రకారులు మాత్రం, ఆ సందర్భంలో Dara Shikoh, Murad Bakhsh చాలా దూరంలో ఉన్నారనీ, ఆ సమయంలో Aurangzeb పక్కన Shah Shuja కూడా ఉన్నాడనీ, అతను కూడా ఏనుగుపై బల్లెం విసిరి దాన్ని తీవ్రంగా గాయపరిచాడనీ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన Shah Jahan కి సంతోషంతో పాటు భయాన్ని కూడా పెంచింది. Aurangzeb కుంచిత ఆలోచనలతో పాటు, తెగువ కూడా కలిసి, ఎప్పటికైనా తన పెద్ద కుమారుడు Dara Shikoh కి ద్రోహం తలపెట్టవచ్చనీ, అతడి మరణానికి కూడా కారణం కావచ్చనీ భావించి, Aurangzeb ని ఢిల్లీ నుంచి దూరంగా, ఆఫ్ఘనిస్తాన్ వైపు పంపించేశాడు. ఆ కాలంలో రాజ కుమారాలకు రాజ్యంలోని ఒక్కో ప్రాంతాన్ని ఇచ్చి, అక్కడ వచ్చే పన్నులు వసూలు చేయడంతో పాటు, ఆ ప్రాంత రక్షణ, విస్తరణ వంటి బాధ్యతలను అప్పచెప్పేవారు. ఆ విధంగా Aurangzeb ని మొదట అతి కఠిన పరిస్థితులు ఉండే ఆఫ్ఘనిస్తాన్ కి పంపగా, ఆ తర్వాత కొన్నేళ్లకు దక్కన్ ప్రాంత గవర్నర్ ను చేశారు.

పెద్ద కొడుకు Dara Shikoh కి అత్యంత సుసంపన్నమైన పంజాబ్ వంటి ప్రాంతాలు ఇచ్చాడు. రెండవ కొడుకు Murad Bakhsh కి గుజరాత్ నూ, ఆఖరి కొడుకు Shah Shuja కి నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ అయిన నాగాలాండ్ వంటి ప్రాంతాలనూ అప్పజెప్పాడు. ఇలా తన తక్కిన కొడుకులందరు పెద్దగా గొడవలు లేని, బాగా ఆదాయం వచ్చే ప్రాంతాలు పొందగా, Aurangzeb కి మాత్రం ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉంటూ, దక్షిణాదిలో మొఘల్ పాలనకు అడ్డుపడుతూ ఉండే దక్కన్ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా బీజాపూర్ సుల్తానులూ, గోల్కొండ కుతుబ్ షాహీలూ తమ సత్తాను కాపాడుకోవడానికి మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసేవారు. అటువంటి వారిని నీయంత్రించడానికీ, వారిని అణగద్రొక్కడానికీ, Aurangabad లో మకాం పెట్టాడు Aurangzeb.

Dara Shikoh ఇస్లాంలోని సూఫీ సున్నిత బోధనలకు ప్రాధాన్యత ఇస్తూ, సంస్కృతంపై పట్టు సాధించడం, హిందూవులను చేరదీయడం, కళలు, రచనలపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. దానితో Dara Shikoh తన జీవితంలో ఒక్కసారి కూడా యుద్ధ క్షేత్రాన్ని చూడలేదు. ఇక రెండవ వాడైన Murad Bakhsh మత్తుకు బానిసై, తన స్నేహితులతో కలిసి ఎప్పుడూ మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మత్తు మందు కొనడానికి అతని స్నేహితులు Diwan Ali Naqi ని సంప్రదించగా, అతను నిరాకరించడంతో వారు Murad Bakhsh కు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పారు. దానితో Murad Bakhsh ఆవేశంలో Diwan తల నరికి చంపాడు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే, ఆఖరి కొడుకు Shah Shuja అతిపెద్ద స్త్రీ లోలుడని చరిత్ర చెబుతోంది. అతనికి చాలా మంది భార్యలతో పాటు, దాదాపు 5 వేలకు పైగా ఉంపుడు గత్తెలు ఉండేవారనీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఆడవాళ్ళతోనే ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇవన్నీ Aurangzeb కు వరంగా మారాయని చెప్పవచ్చు.

Aurangzeb మాత్రం, అత్యంత కష్టమైన ప్రాంతాలలో పనిచేస్తూ, ఆయా ప్రాంతాలలో ఉన్న రెబల్స్ ని నాశనం చేయడమే కాకుండా, తనకు ఎదురైన ప్రాంతాలను బలంతోనూ, కుతంత్రంతోనూ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలా Aurangzeb ఒక పెద్ద మిలటరీ జనరల్ గా మారాడని చరిత్రకారులు చెబుతున్నారు.

కొంత కాలానికి Shah Jahan తీవ్రమైన అనారోగ్యం బారిన పడడంతో, ఆగ్రా కోటలో పాలన మొత్తం తండ్రి పేరుమీద Dara Shikoh చేస్తున్నాడని గ్రహించిన Murad Bakhsh, Shah Shuja, తమకు తాము మొఘల్ చక్రవర్తులుగా ప్రకటించుకుని, వారి పేరుమీద నాణాలు కూడా విడుదల చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడినుంచే Aurangzeb తన కుతంత్రానికి పదును పెట్టాడు. Murad Bakhsh, Shah Shuja లకు తానొక సూఫీ ఫకీరు వంటివాడిననీ, తనకు రాజ్యాధికారంపై ఎటువంటి మామకారమూ లేదనీ నమ్మబలికాడు. Dara Shikoh ను హిందూ పక్షపాతిగా, ఇస్లాం మత వ్యాప్తికి అడ్డు పడుతున్న వాడిగా ముద్రించాడు. అతడిని అధికారంనుంచి తప్పిస్తే నెమలి సింహాసనంపై వారిని కూర్చోపెడతానని చెప్పి, వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈ రాయబారాల కారణంగా ఆ ఇద్దరితో కలిసి భారీ సైన్యాన్ని పోగేసుకున్నాడు. వారికి Shaista Khan సైన్యం కూడా తొడవ్వడంతో పాటు, ఒంటెలపై నుంచి పేల్చగలిగే చిన్నపాటి ఫిరంగులను కూడా పెద్ద సంఖ్యలో పోగేసుకున్నాడు. ఆ కాలానికి అది అధునాతన టెక్నాలజీగా చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా ఆగ్రా కోటపై దండయాత్ర చేసి, Dara Shikoh ని ఓడించి, పారిపోతున్న అతనిని వెంటాడి పట్టుకుని, ఢిల్లీ మొత్తం ఊరేగించి మరీ చంపాడు. Dara Shikoh ముస్లిం మతాన్ని పాటించడం లేదనీ, హిందువులకు సన్నిహితంగా మెలుగుతూ ఇస్లాం మతానికి అత్యంత వ్యతిరేకమైన విగ్రహ పూజలు కూడా చేస్తున్నాడని చెప్పి, అతడిని ఊరి తీయించి, తర్వాత అతని తల నరికి, ఆ తలను ఒక పెట్టెలో పెట్టి, Shah Shuja కి పంపాడు.

అప్పటి వరకు తనతో సహకరించిన Murad Bakhsh మత్తులో ఉనప్పుడు నిర్బంధించి, ఉరి తీయించాడు. ఇక ఆఖరి వాడైన Shah Shuja ని కూడా బంధించమని అజ్ఞాపించగా, అతడు పరివారంతో పాటు నాగాలాండ్ వైపు పారిపోయాడు. అలా వెళ్ళిన Shah Shuja ఏమైపోయాడో ఇప్పటి వరకు తెలియదు. కొంతమంది ప్రకారం, అతడిని అక్కడి ఆటవిక తెగల వాళ్ళు చంపి తినేసి ఉండవచ్చనీ, మరికొంతమంది Aurangzeb సేనలు వేటాడి చంపేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఇక తనకు అడ్డు లేకపోవడంతో, 1668, july 31 న మొఘల్ చక్రవర్తిగా గద్దెనెక్కాడు, Aurangzeb. ఇక అనారోగ్యంతో ఉన్న తండ్రి Shah Jahan ని, ఆగ్ర కోటలో గల ఒక మీనార్ లో బంధించి ఉంచగా, చివరి రోజులు ఆ మీనార్ లోనే గడిపి చనిపోయాడు Shahensha Shah Jahan.

ఇక్కడి వరకు జరిగిన సంఘటనలు Aurangzeb జీవితంలో ఒక భాగం అయితే, చక్రవర్తిగా మారిన తర్వాత నుంచి మరో భాగం మొదలైందని చెప్పవచ్చు. మొదటి నుంచి హిందూ ద్వేషి అవ్వడంతో పాటు, భారత దేశంలో ఇస్లాం మతస్థుతలు మాత్రమే ఉండాలన్న దూరాశాపరుడు. అందువల్ల Aurangzeb, ఆఫ్గనిస్థాన్, దక్కన్ ప్రాంతాలకు గవర్నర్ గా ఉన్నప్పటి నుంచీ, హిందువులు, బౌద్ధులు, సిక్కుల వంటి మతాలను వ్యతిరేకించే వాడు. ఆయా మతాలకు చెందిన ఆలయాలనూ, విగ్రహాలనూ ధ్వంసం చేయడం, వాటిపై మసీదులు కట్టడం వంటి పనులు చేసేవాడు.

ఆ క్రమంలో దక్కన్ ప్రాంత గవర్నర్ గా ఉన్నప్పుడే అతనికి ఎదురొచ్చిన వ్యక్తి, హిందూ ఆశాజ్యోతి, అమిత ప్రకారమ వీరుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్. గెరిల్లా యుద్ధ తంత్రంతో నాటి మొఘల్ సేనలనే కాకుండా, ఆ ప్రాంతంపై పట్టున్న బీజాపూర్ సుల్తాన్ లను కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించడం మొదలు పెట్టారు శివాజీ. ఆ విధంగా ఒక్క కోటతో మొదలైన ఆయన ప్రయాణం, వరుస విజయాలతో అనేక కోటలను దక్కించుకుంటూ ముందుకు సాగారు.

దక్షిణ భారతాన్ని మొత్తం మొఘల్ పాలనలోకి తీసుకురావలనే కోరికతో ఉన్న Aurangzeb, రానున్న కాలంలో శివాజీ మహరాజ్ తన కంట్లో నలుసులా, పక్కలో బల్లెంలా తయారవుతాడని ముందుగానే పసిగట్టి, ఆయనను అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా.. అప్పటికే బీజాపూర్ పై పట్టు తెచ్చుకున్న Aurangzeb, అక్కడి సుల్తాన్ తో కుమ్ముక్కయి, అతడి దగ్గర ఉన్న అత్యంత క్రూరుడు, బలశాలి అయిన Afzal Khan ని పంపాడు. భారీ కాయంతో ఎంతో బలంగా ఉండే Afzal Khan తెలివి, ధైర్యం, యుద్ధ కౌశలం చూసి Aurangzeb, బీజాపూర్ సుల్తాన్ లు సైతం భయపడేవారు. అలాంటి వ్యక్తిని శివాజీ మహరాజ్ ఒక్క దెబ్బతో చంపేయడంతో, Aurangzeb వెన్నులో వణుకు పుట్టింది. ఆ కారణంగానే, తన జీవిత కాలంలో ఏనాడూ, శివాజీ మహరాజ్ తో ఎదురుపడి యుద్ధం చేయలేదు.

తన జీవితంలో చాలా భాగం మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోడానికే వెచ్చించాడు, Aurangzeb. అయినా అతని కోరిక నెరవేరలేదు. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రయత్నంలో అప్పుల ఊబిలో కూరుకు పోయాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆఖరికి నిరాశా నిస్పృహలతో, ఏకాగిగా, పేరు కూడా తెలియని ఘోరమైన జబ్బుతో, అదే మరాఠా గడ్డిపై కుక్క చావు చచ్చాడు.

Aurangzeb తన 50 ఏళ్ల సుధీర్ఘ పాలనలో ఎన్నో దారుణాలు చేశాడు. శివాజీ మహరాజ్ తర్వాత వచ్చిన శంభాజీ మహరాజ్ ని మోసంతో బంధించి, ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపాడో, మన గత వీడియోలో చెప్పుకున్నాము. అంతేకాకుండా శంభాజీ మహరాజ్ భార్యనూ, కొడుకునూ 17 ఏళ్ల పాటు, తన దగ్గర బందీలుగా ఉంచుకుని, మరాఠా విరులను బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే శంభాజీ మరణం తర్వాత గద్దెనెక్కిన అతని సవతి తల్లి కొడుకు రాజా రామ్ కూడా, దాదాపు 11 ఏళ్ల పాటు Aurangzeb సేనలను వీరోచితంగా అడ్డుకున్నాడు. ఈ లోపు శంభాజీ మహరాజ్ కొడుకు సాహూ Aurangzeb దగ్గరే ఉంటూ, అతని నమ్మకాన్ని చూరగొని, రహస్యంగా మరాఠా వీరులకు సహాయం చేసేవాడు. Aurangzeb మరణం తర్వాత తన సామ్రాజ్యానికి వెళ్ళి, ఛత్రపతిగా అధికారం చేపట్టాడు.

Aurangzeb తన జీవిత కాలంలో ఏ ఇతర మతాన్నీ బ్రతకనిచ్చేవాడు కాదు. 9వ సిక్కు గురువైన Guru Tegh Bahadur ని కూడా మోసం చేసి పట్టుకుని, మతం మారమని బలవంత పెట్టాడు. Guru Tegh Bahadur అందుకు నిరాకరించడంతో, ఆయనను అత్యంత కిరాతకంగా చంపాడు. తన కళ్ల ముందే ఆయన అనుచరులను చిత్ర హింసలు పెట్టి, మరుగుతున్న పెద్ద పెద్ద నీళ్ళ తొట్టెలలో పడేయించి, పొడిచి పొడిచి చంపాడు. అదే విధంగా Guru Tegh Bahadur ని కూడా చిత్ర హింసలు పెట్టి, ఆఖరికి తల నరికి చంపాడు.

Guru Tegh Bahadur కొడుకు, సిక్కుల ఆఖరి మత గురువైన Guru Gobind Singh కొడుకులను బంధించి, మతం మారకపోతే చంపేస్తానని బెదిరించాడు. వారు చావునే ముద్దాడడానికి సిద్ధపడడంతో, బ్రతికి ఉండగానే వారిని సమాధి చేసి చంపించాడు, Aurangzeb జనరల్ అయిన Wazir Khan. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, చనిపోయేనాటికి వారిలో ఒకరి వయసు 6, మరొకరి వయసు 9 ఏళ్లు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చంపించిన నరరూప రాక్షసుడు Aurangzeb.

Aurangzeb యొక్క హిందూ వ్యతిరేక పోకడుల కారణంగా, మరాఠాలూ, శిక్కులే కాకుండా, రాజ్ పుత్ లు, ఝాట్ ల వంటి ఎంతో మంది ఎదురు తిరిగారు. వీరిని అణచివేసే సమయంలో చాలాసార్లు ఘోరంగా ఒడిపోయినా, నెగ్గిన యుద్ధాలలో దొరికిన సైనికులను అత్యంత భయంకరమైన పద్ధతులలో చంపించాడు. మతం మారని హిందువులను చిత్ర హింసలు పెట్టి చంపుతూ, మగవారి ముందే వారి ఆడవాళ్లను వివస్త్రలను చేసి, వారి జననంగాలను కోయించి పైశాచికానందాన్ని పొందేవాడు. అత్యంత దారుణంగా ఆడవారిని చెరచి చంపించేవాడు. అందంగా ఉన్న కొంతమంది ఆడవారిని మధ్య ఆసియా దేశాలకు బానిసలుగా పంపేవాడు. 

తనకు ఎదురైన ప్రతి మందిరాన్నీ నెలమట్టం చేసి, దానిపై మసీదులు కట్టేవాడు. ఇలా Aurangzeb పాలనలో నాశమైన అత్యంత ముఖ్యమైన ఆలయాలలో, కాశీలోని జ్ఞానవాపి ఆలయం, మధుర శ్రీ కృష్ణ మందిరం ప్రముఖమైన ఆలయాలు. ఇలా ఒక్కటేమిటి, కొన్ని లక్షల హిందూ ఆలయాలనూ, బౌద్ధ, జైన క్షేత్రాలనూ సర్వ నాశనం చేశాడు. ఎప్పుడో రద్దు చేసిన జిజియా పన్నును మళ్ళీ ప్రవేశ పెట్టాడు. ఈ పన్ను ప్రకారం, ముస్లిమ్స్ కాని వారందరూ, ఇంట్లో చిన్న పూజ చేసుకున్నా పన్ను కట్టాలి. వ్రతం చేసుకుని నలుగురుకి భోజనం పెట్టినా పన్ను కట్టాలి. బ్రాహ్మణులు పిలకలు పెట్టుకుంటే, ఆ పిలకకు కూడా పన్ను కట్టాలి. జంధ్యము వేసుకుంటే పన్ను కట్టాలి. గుడికి వెళ్లాలంటే పన్ను కట్టాలి, అదే గుడి లోనుంచి బయటకు రావలన్నా పన్ను కట్టాలి. ఇలా Aurangzeb ప్రజల మాన ప్రాణాలను దోచుకు తిన్నాడు. ఇదిలా ఉంటే, ఇంత దారుణమైన, క్రూరమైన పాలకుడిని సైతం, మన కుహనా మేధావులు ఓ గొప్ప చక్రవర్తిగా వర్ణించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మనవారు అసలు చరిత్రను తెలుసుకోవడంతో పాటు, భావి తరాలకు ఆ గాధలను తెలియజేసే ప్రయత్నం చేయాలి.

🚩 జై భారత్ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home